రూ .48,000 కోట్ల ప్రోత్సాహకాలతో ఇండియా లో ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచే పథకాలను ఆమోదించిన కేబినెట్

దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడానికి మొత్తం 48,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకంతో మూడు పథకాలను కేంద్ర మంత్రివర్గం క్లియర్ చేసినట్లు టెలికాం, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం తెలిపారు.
Ravi-Shankar-Prasad-minister.jpg (1279×753)
ఈ పథకాల ద్వారా 2025 నాటికి రూ .10 లక్షల కోట్లు రెవెన్యూ సమకూరే అవకాశంతో పాటు , ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు. ఇదికాకుండా, శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దేశంలో వైద్య సంరక్షణ కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడటాన్నితగ్గించడానికి వైద్య పరికరాల తయారీకి ప్రోత్సాహకాలను ఆమోదించింది.

వచ్చే 5 సంవత్సరాల వ్యవధిలో అర్హత కలిగిన ఎలక్ట్రానిక్ ఉత్పాదక సంస్థలకు , ఈ పథకం కింద, భారతదేశంలో తయారైన మరియు అర్హమైన విభాగాల పరిధిలో వచ్చే వస్తువుల పెరుగుతున్న అమ్మకాలపై (బేస్ ఇయర్) 4 నుండి 6 శాతం ప్రోత్సాహకం లభిస్తుంది. 

ఎలక్ట్రానిక్స్ భాగాలు మరియు సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి 8 సంవత్సరాల వ్యవధిలో 3,285 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయాన్ని కేబినెట్ ఆమోదించింది. 

Post a Comment

0 Comments