భారత బ్యాట్స్మెన్ మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ల 2002 లో ఇంగ్లండ్ క్రికెట్ టీం పై చేసిన కీలకమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, మార్చి 22 న జరిగే 'జనతా కర్ఫ్యూ'ను పాటించడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిపై గట్టిగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలును కోరారు.

భారతదేశంలో 270 మందికి పైగా సోకిన కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 న 'జనతా కర్ఫ్యూ' చేయాలని పిఎం మోడీ గురువారం పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి విజ్ఞప్తి తరువాత, క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ట్విట్టర్లో, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలను కూడా అదే విధంగా అభ్యర్థించాడు. కైఫ్ ట్వీట్పై స్పందించిన పిఎం మోడీ, ఇది మరో భాగస్వామ్యానికి సమయం అని అన్నారు.
"ఇక్కడ ఇద్దరు అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు, వీరి భాగస్వామ్యం మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. ఇప్పుడు, వారు చేసినట్లు, ఇది మరొక భాగస్వామ్యానికి సమయం. ఈసారి, కరోనావైరస్పై పోరాటంలో భారతదేశం మొత్తం భాగస్వామ్యం అవుతుంది. #IndiaFightsCorona" అని పీఎం మోడీ, క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ ను ఉటంకిస్తూ చెప్పారు.
ఇంగ్లండ్తో జరిగిన నాట్వెస్ట్ ఫైనల్లో కైఫ్, యువరాజ్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ జట్టు 5 వికెట్లకు 146 పరుగులు తో కష్టాల్లో ఉన్నప్పుడు , వీరిద్దరి బాటింగ్ తో మూడు బంతులతో 2 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.

భారతదేశంలో 270 మందికి పైగా సోకిన కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 న 'జనతా కర్ఫ్యూ' చేయాలని పిఎం మోడీ గురువారం పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి విజ్ఞప్తి తరువాత, క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ట్విట్టర్లో, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలను కూడా అదే విధంగా అభ్యర్థించాడు. కైఫ్ ట్వీట్పై స్పందించిన పిఎం మోడీ, ఇది మరో భాగస్వామ్యానికి సమయం అని అన్నారు.
"ఇక్కడ ఇద్దరు అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు, వీరి భాగస్వామ్యం మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. ఇప్పుడు, వారు చేసినట్లు, ఇది మరొక భాగస్వామ్యానికి సమయం. ఈసారి, కరోనావైరస్పై పోరాటంలో భారతదేశం మొత్తం భాగస్వామ్యం అవుతుంది. #IndiaFightsCorona" అని పీఎం మోడీ, క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ ను ఉటంకిస్తూ చెప్పారు.
ఇంగ్లండ్తో జరిగిన నాట్వెస్ట్ ఫైనల్లో కైఫ్, యువరాజ్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ జట్టు 5 వికెట్లకు 146 పరుగులు తో కష్టాల్లో ఉన్నప్పుడు , వీరిద్దరి బాటింగ్ తో మూడు బంతులతో 2 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.
0 Comments