మార్చి 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య ‘జనతా కర్ఫ్యూ’ కోసం పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ

మార్చ్ 19 న ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్ బారిన పడకుండా ఉండటానికి వీలైనంత వరకు ఇంటి లోపల ఉండాలని ఆయన భారతీయులందరికీ విజ్ఞప్తి చేశారు, ప్రపంచం ఇంతవరకు ఇంత ప్రమాదకరమైన విపత్తును చూడలేదని అన్నారు.
f3a236e7ad571f774f1b7f787ffcd321.jpg (736×414)
మార్చి 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య ‘జనతా కర్ఫ్యూ’ కోసం పిలుపునిచ్చిన ఆయన, అవసరమైన సేవల్లో ఉన్నవారిని మినహాయించి ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అన్నారు. "మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధం కంటే కూడా కరోనావైరస్ అనేక దేశాలను ప్రభావితం చేసింది అని తెలిపారు." కరోనావైరస్ కు ఇంకా చికిత్స లేదు, సురక్షితంగా ఉండటానికి ఏకైక మార్గం ఇంటి లోపల ఉండటమే మోడీ చెప్పారు. 

నిత్యావసర సేవల సిబ్బంది నిస్వార్థంగా చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మార్చి 22 సాయంత్రం 5 గంటలకు ప్రజలు అందరు చప్పట్లు కొట్టాలని కోరారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భయంతో కిరాణా సామాను అధికంగా కొనకుండ అవసరం మేరకే కొనండి అని సూచించారు. 

Post a Comment

0 Comments